28.7 C
Hyderabad
April 20, 2024 06: 22 AM
Slider ప్రకాశం

ఆసుపత్రి నుంచి ఐదు రోజుల పసికందు మాయం

#Crime Scene

ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రభుత్వ వైద్యశాల నుండి అయిదు రోజుల పసికందుని ఓ గుర్తు తెలియని మహిళ ఎత్తుకెళ్లింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గుంటూరు జిల్లా కారంపూడి దగ్గర్లోని గ్రామానికి చెందిన కోమలి అనే నిండు గర్భిణీ  ప్రసవం కోసం మార్కాపురం మండలంలోని కోలా భీమునిపాడుకి వచ్చారు.

నొప్పులు రావడంతో 5 రోజుల కిందట మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలలో చేర్చారు. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈరోజు గుర్తుతెలియని మహిళ వచ్చి ఆ పాపని ఎత్తుకెళ్లారు.

ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే కారణం అంటూ పాప తండ్రి ఆరోపిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Related posts

కార్మికులారా ఏకంకండి మనకు పోరాటమే శరణ్యం

Satyam NEWS

సిఏఏ, ఆర్టికల్ 370 పై సౌదీలో ఇస్లామిక్ దేశాల మీటింగ్

Satyam NEWS

మూడు రాజధానులకు ముహూర్తం కుదిరింది

Satyam NEWS

Leave a Comment