ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రభుత్వ వైద్యశాల నుండి అయిదు రోజుల పసికందుని ఓ గుర్తు తెలియని మహిళ ఎత్తుకెళ్లింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గుంటూరు జిల్లా కారంపూడి దగ్గర్లోని గ్రామానికి చెందిన కోమలి అనే నిండు గర్భిణీ ప్రసవం కోసం మార్కాపురం మండలంలోని కోలా భీమునిపాడుకి వచ్చారు.
నొప్పులు రావడంతో 5 రోజుల కిందట మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలలో చేర్చారు. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈరోజు గుర్తుతెలియని మహిళ వచ్చి ఆ పాపని ఎత్తుకెళ్లారు.
ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే కారణం అంటూ పాప తండ్రి ఆరోపిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.