హైదరాబాద్ లోని మోయిన్ చెరువు నుంచి ఎస్టిపి లో గల నాలా వరకు నూతన నాలని నిర్మించుటకు సంబంధిత జిహెచ్ఎంసి అధికారులు జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుడు అంబర్పేట్ కార్పొరేటర్ ఈ.విజయ్ కుమార్ గౌడ్ తో కలిసి శనివారం నాలా పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ నాలా పనులకు 22 కోట్ల రూపాయలు కేటాయించారు. కేటీఆర్ కి అంబర్పేట్ నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అధికారులు నాల పరీవాహక ప్రాంతాన్ని పరిశీలించి త్వరలోనే నూతన నాల నిర్మాణాన్ని చేపడతామనీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అధికారులు జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ వేణుగోపాల్, వాటర్ వర్క్స్ డిజిఎం సతీష్, టౌన్ ప్లానింగ్ అధికారి సాయిబాబా, డీఈ సుధాకర్, డీఈ సువర్ణ, ఎఈ కుషాల్, ఎఈ శ్వేత, వర్క్ ఇన్స్పెక్టర్ దుర్గా, మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు రంగు ఉదయ్ గౌడ్, లవంగు నాగరాజు, సంతోష్ చారి తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట