వనపర్తి నియోజకవర్గం ప్రజలను,అన్ని పార్టీల నాయకులను,విలేకరులను, సంఘాల వారిని మరిచిపోనని వనపర్తి నుండి గద్వాలకు బదిలీ అయిన పోలీస్ సి.ఐ. సూర్యనాయక్ చెప్పారు. వనపర్తిలో సాహితీ కళావేదిక ప్రధాన కార్యదర్శి, జర్నలిస్ట్ అయిందాల ఓంకార్,కవి బైరోజు చంద్రశేఖర్, యోగ సభ్యులు సి.ఐ. సూర్యనాయక్ కు సన్మానం చేశారు.
వనపర్తికి వచ్చిన కొత్త సి.ఐ. ప్రవీణ్ కుమార్ కు పూల బొకే ఇచ్చి సత్కరించారు.ఈ సందర్భంగా సి.ఐ. సూర్యనాయక్ ప్రసంగిస్తూ వనపర్తిలో ప్రజలు, విలేకరులు తమకు సహకరించారని తెలిపారు. వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వనపర్తి సర్కిల్ పరిధిలో ప్రజలకు సహకరిస్తామని వనపర్తి సి.ఐ. ప్రవీణ్ కుమార్ చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉంటామని,పోలీస్ శాఖకు సహకరించాలని ఆయన కోరారు. సి.ఐ. సూర్యనాయక్ చేసిన సేవలను ఓంకార్, బైరోజు చంద్రశేఖర్ ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నేత జి.జె.శ్రీనివాసులు, కవి గిరి రాజాచారి,జిల్లా బిజెపి మైనార్టీ మోర్చా అధ్యక్షుడు మహ్మద్ కరీం,కోడెర్ మండలం నర్సయిపల్లి మాజీ సర్పంచ్ భాస్కర్ పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి