ఆగస్టు 15 లోపు సమీకృత వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయం పనులను పూర్తి చేసి అప్పగించాలని సంబంధిత కాంట్రాక్టర్ ను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశించారు. బుధవారం వనపర్తిలోని నూతన కలెక్టర్ కార్యాలయాన్ని మంత్రి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆగస్టు 15 కన్న ముందు జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవం కోసం ముఖ్యమంత్రి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఈ నెల 15 లోపు కార్యాలయ పనులు పూర్తిచేసి అప్పగించాలని సంబంధిత కాంట్రాక్టర్ ను ఆదేశించారు.
అలాగే 200/3 సర్వే నంబర్ లో 50 ఎకరాల స్థలాన్ని మెడికల్ కళాశాలకు పరిశీలించారు. మెడికల్ కళాశాల స్థలంలో 80 ఫీట్ల రోడ్డును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 15లోపు జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవం, మెడికల్ కళాశాల శంకుస్థాపన ముఖ్యమంత్రి చేతుల మీదుగా జరగనున్నదని మంత్రి తెలిపారు. పాల శీతలీకరణ కేంద్రం ప్రక్కన గొర్రెల ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయడానికి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, జిల్లా అటవీ శాఖ అధికారి పెండ్యాల రామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, తహసిల్దార్ రాజేందర్ గౌడ్ పాల్గొన్నారు.
పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యంన్యూస్.నెట్