తెలంగాణ శిల్పకళా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ హుజూర్ నగర్ పట్టణ అధ్యక్షుడు, కో- ఆప్షన్ సభ్యులను మంగళవారం స్థానిక CITU కార్యాలయంలో ఎన్నుకున్నట్లు ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్ విలేఖర్లకు తెలియజేశారు.
ఈ సందర్భంగా సోమయ్య గౌడ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక, కర్షక ప్రజావ్యతిరేక విధానాలు, మొండి వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జనవరి ఏడవ తేదీన జరిగే కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయాలని కార్మికులను కోరారు.నూతన శిల్ప కళ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అద్యక్షుడిగా ఎన్నికైన ఉప్పతల వెంకన్న, సభ్యులకు అభినందనలు తెలియజేశారు.
కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి, ఆ సంఘం జిల్లా నాయకులు బాల శౌరెడ్డి, జయకృష్ణ, పల్లపు రామకృష్ణ, మండల అధ్యక్షుడు ఉప్పతల గోవింద్, ప్రధాన కార్యదర్శి షేక్ ముస్తాఫా, ఉప్పతల నరేష్, శీలం వేణు, నగేష్, సుభాని, శ్రీను, రాజు,అక్బర్, సోమేశ్ సాయి, సతీష్,తదితరులు పాల్గొన్నారు.