తిరుమల తిరుపతిలో ఏం జరుగుతున్నది? ఏమో తెలియదు. తిరుమల తిరుపతి దేవస్థానం లో పని చేసే ప్రధాన అర్చకుడు వేంకటరమణదీక్షితులు ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు? ఏమో తెలియదు. అసలు ఈ గోల ఏమిటి? తెలియదు. వేంకట రమణ దీక్షితులు దేవుడిని కోరి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చేలా చేశారు.
మరి ఆయనకు ఇప్పుడు అసంతృప్తి ఎందుకో అర్ధం కావడం లేదు. ఈ ప్రశ్నలన్నీ ఆయన ట్వీట్ చూస్తే ఎవరైనా వేస్తారు. సీఎం జగన్కు ట్యాగ్ చేస్తూ వేంకట రమణ దీక్షితులు ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఏమిటంటే ‘‘శ్రీవారి ఆశీస్సులతో మీ పరిపాలనలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులంతా సంతోషంగా ఉన్నారు. మీ ఆదేశాలతో ఏప్రిల్ 2న ప్రధాన అర్చకుడిగా నియమిస్తూ టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది.
శ్రీవారి కైంకర్యాలను నిర్వహించనీయకుండా అడ్మిన్ మాతో ఆడుకుంటున్నారు. ఇప్పుడు మేము కోర్టును ఆశ్రయించాం. దయచేసి మా సమస్యపై స్పందించండి. అడ్మిన్ను సరైన మార్గంలో పెట్టండి. అడ్మిన్ చర్చనీయాంశంగా మారారు.’’ అని జగన్కు రమణ దీక్షితులు ట్వీట్ చేశారు. అడ్మిన్ ఎవరు? అదేది మాత్రం చెప్పలేదు.