కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన జాతీయ విద్యా విధానం 2020 గొప్పగా ఉందని దీన్ని స్వాగతిస్తున్నామని తపస్ బిచ్కుంద అధ్యక్షులు వై రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి శేఖ్ ఖయ్యూమ్ తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విదేశీ భావ దారిద్ర్యం గల విద్యా విధానాలతో 70 ఏళ్లలో జరిగిన విధ్వంసానికి జాతీయ నూతన విద్యా విధానం తో చెల్లు అవుతుందని, కేంద్రప్రభుత్వం ఆమోదించిన ఈ విద్యావిధానం విద్యార్థులలో జాతీయ భావాలను, స్వీయ నైపుణ్యాలను పెంచి భారత్ ను విశ్వగురువుగా తిరిగి నిలబెడుతుందన్నారు. ఈ నూతన విద్యా విధానానికి తపస్ జాతీయ స్థాయిలో విలువైన సూచనలు చేసిందని వారు తెలియజేశారు.
భారత ప్రధాని నరేంద్ర మోడి , కేంద్ర విద్యా శాఖా మంత్రి రమేశ్ నిశాంక్ ఫోఖ్రియాల్ లకు తపస్ తరపున ధన్యవాదాలు ప్రకటించి బిచ్కుంద లో హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తపస్ కామారెడ్డి జిల్లా జిల్లా కార్యదర్శి రచ్చ శివకాంత్, జిల్లా కార్యవర్గ సభ్యులు యెన్నావార్ జనార్ధన్, యం విజయ్ కుమార్, హీరా , తపస్ జుక్కల్ శాఖ అధ్యక్షులు జై చంద్, తపస్ బిచ్కుంద సహ- కార్యదర్శి ఎమ్ సంజయ్ తదితరులు పాల్గొన్నారు.