దేశంలోని అష్టాదశ శక్తిపీఠాలలో అయిదవ శక్తిపీఠం, తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక శక్తి పీఠం అలంపూర్ శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయాల ఈ ఓ గా పురంధర్ కుమార్ నియమితులయ్యారు. హైదరాబాద్ లోని ఎల్బీనగర్ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ ఈవోగా పనిచేస్తున్న పురందర్ అలంపూరు దేవాలయాలకు రావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. గతంలో జిల్లాలోని మల్దకల్, జమ్మి చెడు, పాగుంట దేవాలయాల కార్యనిర్వహణాధికారిగా విశేష సేవలు అందించారు. ప్రస్తుతం పురందర్ కుమార్ తెలంగాణ రాష్ట్ర దేవాలయాల కార్యనిర్వహణాధికారుల సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. పురందర కుమార్ మరిన్ని ఉన్నత పదవులలో రాణించాలని ఆయన స్నేహితులు, శ్రేయోభిలాషులు కోరుతున్నారు.
previous post
next post