మీకు ఒక విషయం తెలుసా? కరోనా వైరస్ ఇండియాలోనే పుట్టింది. మీరు కరెక్టే చదివారు. కరోనా వైరస్ ఇండియాలోనే పుట్టి చైనాలోని వూహాన్ కు చేరిందట. ఈ విషయాన్ని చైనా లోకి ఒక పరిశోధక బృందం తేల్చింది. 2019 వేసవి కాలంలో కరోనా వైరస్ ఇండియాలో పుట్టిందట.
కరోనా వైరస్ కలుషితమైన నీటి నుంచి పుట్టిందట. ఇక్కడ నుంచి వచ్చిన ఒకరు ఆ వైరస్ ను వూహాన్ లో అంటించారని చైనా పరిశోధక బృందం తేల్చి చెప్పేసింది. వూహాన్ లోకి వచ్చే వరకూ ఎవరూ కూడా కరోనా వైరస్ గురించి గుర్తించలేదని, వూహాన్ కు వచ్చి పెరిగిన తర్వాత అందరూ దాని గురించి తెలుసుకున్నారని ఈ పరిశోధకులు అంటున్నారు.
జంతువుల నుంచి కలుషిత జలాలకు, ఆ కలుషిత జలాన్ని తాగిన మనుషులకు కరోనా వైరస్ వచ్చిందని ఆ మనిషి వూహాన్ కు వచ్చాడని వారు అంటున్నారు.
ఇంతకన్నా ముందు చైనాకు చెందిన కొందరు పరిశోధకులు ఇదే తీరుగా ఇటలీ నుంచి వచ్చిందని, కాదూ అమెరికాలోనే కరోనా వైరస్ పుట్టింది అంటూ కతలు చెప్పారు. ఇప్పుడు ఇండియాపై బురద చల్లుతున్నారు. పరిశోధనా ఫలితాలను మెయిల్ ఆన్ లైన్ అనే వెబ్ సైట్ లో రిపోర్టు చేశారు.