అన్లాక్ 4.0లో భాగంగా ఈ నెల 21 నుంచి 9 నుంచి 12 తరగతుల వరకు క్లాసుల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమశాఖ పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. విద్యార్థులకు ఇష్టమైతేనే బడికి వెళ్లవచ్చు.
లేదంటే ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్ క్లాసులు వినవచ్చు. ఈ మేరకు తల్లిదండ్రులు/సంరక్షకుల నుంచి రాతపూర్వక లేఖను విద్యార్థులు సమర్పించాలని పేర్కొన్నది.
1.కంటైన్మెంట్ జోన్లకు బయట ఉన్న స్కూళ్లనే తెరవాలి. కంటైన్మెంట్ జోన్లలోని విద్యార్థులు,టీచర్లు, ఉద్యోగులు బడికి రావద్దు.
2. తరగతి గదితోపాటు అందరూ వినియోగించే అన్ని ప్రాంతాలను విధిగా శానిటైజ్ చేయించాలి. ఒకవేళ స్కూల్ను క్వారంటైన్ సెంటర్గా వాడితే పరిసరాలన్నింటినీ వందశాతం శానిటైజ్ చేయాలి.
3.చేతులు కడుక్కోవడానికి వీలుగా సబ్బులు, శానిటైజర్లను విద్యార్థులు, సిబ్బందికి అందుబాటులో ఉంచాలి. స్టాఫ్గది, కార్యాలయం,మెస్, గ్రంథాలయం, కేఫటేరియాల్లో భౌతికదూరం పాటించేలా చూడాలి.
4. విద్యార్థి, టీచర్ మధ్య ఇంటరాక్షన్ కోసం ఆరుబయట, లేదంటే చెట్ల కింద ఏర్పాట్లు చేయాలి.
5. తరగతి గది ఉష్ణోగ్రతలు 24 -30 సెల్సియస్ డిగ్రీలుగా, తేమ 40 -70 శాతంగా ఉండాలి. స్వచ్ఛమైన గాలిని పీల్చుకునేందుకు వీలుగా కిటికీలు, తలుపులు తెరిచి ఉంచాలి.
6. విద్యార్థులు ఉపయోగించే, లాకర్లు,అల్మారాలను రోజుకొకసారి శానిటైజేషన్ చేయాలి. ఈతకొలనులను తెరవద్దు.
7. యాక్టివిటీస్ సమయంలో.. నోటుపుస్తకాలు, పెన్నులు,పెన్సిళ్లు, వాటర్బాటిళ్లను ఒకరినొకరు మార్చుకోవడాన్ని అనుమతించరాదు. ప్రయోగశాలల్లోకి తక్కువ మందిని అనుమతించాలి. సెషన్లుగా విభజించి విద్యార్థులను తీసుకెళ్లాలి. ప్రయోగశాలల్లోని పరికరాలను వాడకముందు, వాడిన తర్వాత ఎప్పటికప్పుడు శానిటైజ్చేయాలి. టైమ్స్లాట్స్గా, విద్యార్థులను బృందాలుగా విభజించి కృత్యాలు నిర్వహించాలి. అనంతరం శానిటైజ్ చేయాలి.
8. కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ప్రింటర్లను 70 శాతం ఆల్కహాల్ గల వైపర్లతో క్రిమికీటకనాశనం చేయాలి. తాగునీరు, హ్యాండ్వాష్స్టేషన్లు, మూత్రశాలలు, మరుగుదొడ్లును పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
9. బస్సుల్లో విద్యార్థులను తరలించేటప్పుడు భౌతికదూరం పాటించాలి.
10. సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు వాడిన మాస్క్లు ప్రత్యేక డబ్బాల్లో వేయాలి. మూడురోజుల కోసారి పడేయాలి.
11.విద్యార్థులు, ఉపాధ్యాయులు అనారోగ్యానికి గురైన వారిని పాఠశాలకు రావొద్దని ఆదేశించాలి. విద్యార్థులు,టీచర్లల్లో ఎవరైనా అనారోగ్యానికి గురైతే వారిని ఇతరుల నుంచి వేరుచేయాలి (ఐసోలేషన్). అనార్యోగానికి గురైనవారికి ఒకవేళ పాజిటివ్వస్తే వెంటనే వారు తిరిగిన ప్రదేశాలను శానిటైజేషన్ చేయాలి.
12.అందరూ ఆరోగ్యసేతు యాప్ను ఇన్స్టాల్ చేసుకుని వాడాలి.