ప్రస్తుతం లాక్ డౌన్ అమలులో వున్న విజయనగరం నగర పరిధిలో హోటళ్లు, రెస్టారెంట్లకు రోజంతా తెరిచేందుకు అనుమతి ఇస్తున్నట్టు జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ తెలిపారు.
నగరంలో దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, రైతుబజార్లు, పాల విక్రయ కేంద్రాలు వంటివన్నీ ఉదయం 7 నుండి మధ్యాహ్నం 1-00 గంటల వరకే తెరిచేందుకు అనుమతి వుంటుందన్నారు.
ఫార్మసీలు మాత్రం రోజంతా తెరిచేందుకు అనుమతి వుంటుందని తెలిపారు. ఆగష్టు 3వ తేదీ సోమవారం నుండి ఈ నిబంధనలు అమలులోకి వస్తాయని పేర్కొన్నారు.