37.2 C
Hyderabad
March 28, 2024 19: 15 PM
Slider ముఖ్యంశాలు

కాంగ్రెస్ బలాన్ని చాటి చెప్పిన భట్టి రైతు యాత్ర

#MalluBhatti

కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నాయకుడు మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన రైతులతో ముఖాముఖి-పొలంబాట, పోరుబాటు కార్యక్రమాలు తెలంగాణ సమాజంపై మంచి ప్రభావాన్ని చూపించాయి.

పొలంబాట-పోరుబాటలో రైతుల సమస్యలు నేరుగా తెలుసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భట్టి ఇచ్చిన భరోసా క్షేత్రస్థాయిలో మంచి ఫలితాన్ని ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉందనుకున్న ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ (ఉమ్మడి జిల్లాలు)లలో భట్టి యాత్ర సంచలనాలకు కేంద్రంగా నిలిచింది.

ఇక నారాయణ ఖేడ్ ప్రాంతంలో టమాట రైతులు, బాల్కొండ పసుపు రైతులు, ఆదిలాబాద్ పోడు వ్యవసాయం చేసుకునే గిరిజన రైతులు, కరీం నగర్ లో చెరుకు రైతులు.. ఇలా ఒకరేమిటి అన్నదాతలంతా.. భట్టి కాన్వాయ్ ను ఆపి.. తమ గోడు చెప్పుకున్నారు.

మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మాజీలు, వర్కింగ్ ప్రెసిడెంట్స్, జిల్లా అధ్యక్షులు అందరినీ ఒకే వేదికమీదకు తెచ్చి.. కాంగ్రెస్ పార్టీ సమష్టిగా ఉందనే బలమైన సంకేతాలను కేడర్ కు పంపారు.

Related posts

ఎగ్జిట్ ట్రెండ్: దేశభక్తిని ఊడ్చేసిన చీపురు పార్టీ

Satyam NEWS

గుడ్ న్యూస్: డాక్టర్లకు, వైద్య సిబ్బందికి శాలరీ కట్ లేదు

Satyam NEWS

దేశంలో యెల్లో ఫంగస్ :ఉత్తర్‌ప్రదేశ్‌ ఘజియాబాద్‌లో గుర్తింపు

Satyam NEWS

Leave a Comment