మినీ మెడికల్ హబ్ గా మారిన గుంటూరు జిల్లా నరసరావుపేటలో మరో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం అయింది. వినుకొండ రోడ్ లో ఏర్పాటు చేసిన ఈ మాతాశ్రీ హాస్పిటల్ ను నేడు నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి పాల్గొన్నారు. గురజాల శాసనసభ్యుడు కాసు మహేష్ రెడ్డి, వినుకొండ శాసనసభ్యుడు బొల్లా బ్రహ్మనాయుడు, షేక్ కార్పొరేషన్ చైర్మన్ ఆషాబేగం ఖాజావలె తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇంకా మార్కెట్ యార్డ్ చైర్మన్ హనీఫ్, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి మిట్టపల్లి రమేష్, మద్ది రెడ్డి నరసింహా రెడ్డి, పిల్లి ఓబుల్ రెడ్డి, మోరబోయిన శ్రీనివాస్ రావు, మూరే రవీంద్ర రెడ్డి, కనక పుల్లారెడ్డి తదితర వైఎస్సార్సీపీ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.