28.7 C
Hyderabad
April 25, 2024 04: 44 AM
Slider గుంటూరు

న్యూమాంక్స్ కుంగ్ ఫు అసోసియేషన్ గౌరవ సలహాదారు గా రావుసుబ్రహ్మణ్యం

#newmonks

న్యూమాంక్స్ కుంగ్ ఫు అసోసియేషన్ గౌరవ సలహాదారు గా నవతరంపార్టీ జాతీయ అధ్యక్షులు రావుసుబ్రహ్మణ్యం ఎన్నిక అయ్యారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట లోని పొట్టిశ్రీరాములు కాంప్లెక్స్ పైన నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. న్యూ మాంక్స్ కుంగ్ ఫు ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ ఎస్ ఎం కమాల్ భాషా నేతృత్వంలో కుంగ్ ఫు విద్యార్థుల తల్లిదండ్రులు సమక్షంలో ఈ ఎన్నిక జరిగింది.

గౌరవ అధ్యక్షులు గా తేళ్ల సుబ్బారావు,అధ్యక్షులు గా పఠాన్ సమద్ ఖాన్,ఉపాధ్యక్షులుగా నిడమానూరి సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి గా అవ్వారు సత్యనారాయణ,సహాయ కార్యదర్శి గా మండ్రు రమేష్,కోశాధికారిగా గుంజి అంకమ్మరావు ఎన్నికయ్యారు. కుంగ్ ఫు క్రీడ, ఇతర అన్నీ క్రీడలు అభివృద్ధి కోసం ఈ కమిటీ పనిచేస్తుంది అని అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్ తెలిపారు.

కమాల్ భాషా జన్మదినం సందర్భంగా కేక్ కోసి కమిటీ సభ్యులు, విద్యార్థులు, తల్లిదండ్రులు శుభాకాంక్షలు తెలిపారు. చిలకలూరిపేట లో ప్రభుత్వం స్టేడియం ఏర్పాటు చేయాలని కమిటీ తీర్మానం చేసింది. సరైన క్రీడా ప్రాంగణం లేక అన్నీ రకాలుగా క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారు అని అభిప్రాయం వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో భాగంగా సీనియర్ పాత్రికేయులు దార్ల బుజ్జిబాబుని ఘనంగా సన్మానించారు. ప్రజలందరూ సంక్రాంతి పండుగ జరుపుకోవాలని కోరుతున్నామన్నారు. కార్యక్రమానికి ముల్లా కరిముల్లా అధ్యక్షత వహించగా నిడమానూరి హనుమంతరావు, సుభాని, చంద్ర,శ్రీకాంత్, తాహేర్,రఫీ,దామర్ల మనోహర్, జంజనం వెంకటేశ్వరరావు, విజయ్,కల్యాణి, రావుశ్రీకృష్ణదేవరాయలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

దళితుల నిధులు ఖర్చు చేయని సీఎం కేసీఆర్

Satyam NEWS

ఈజీ మనీ: డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తి అరెస్ట్

Satyam NEWS

ఇస్రో చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం

Satyam NEWS

Leave a Comment