40.2 C
Hyderabad
April 24, 2024 18: 28 PM
Slider సినిమా

అఖిల్ అక్కినేని తో రొమాన్స్ చేస్తున్న పూజా హెగ్డే

#Puja Hegde

అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కుతున్న చిత్రం “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్”. టాలెంటెడ్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో రెడీ అవుతున్న ఈ సినిమాకి టాలీవుడ్ లో వ‌రుస‌గా భ‌లేభ‌లేమ‌గాడివోయ్‌, పిల్లానువ్వులేని జీవితం, గీతాగోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్స్ తో  మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా క్రేజ్ ని సొంతం చేసుకున్న‌ బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మ తో కలిసి నిర్మిస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్ లో అఖిల్ అక్కినేని సరసన బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇది ఇలా ఉంటే “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” సినిమా అనౌన్స్ ఐనా దగ్గర నుంచి అక్కినేని అభిమానుల్లో ఫుల్ క్రేజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే.

అక్కినేని అభిమానుల్లో అనూహ్య స్పందన

ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ టీం విడుదల చేసిన అఖిల్ అక్కినేని ఫస్ట్ లుక్ కు,  అలానే హ్యాపెనింగ్ స్టార్ సింగర్ సిద్ద్‌ శ్రీరామ్ పాడిన మనసా పాటకు, పూజా హెగ్డే ఫస్ట్ లుక్ కు అటు సోషల్ మీడియా లో ఇటు అభిమానుల్లో అనూహ్యమైన స్పందన లభించింది.

ఇదే ఉత్సాహంతో అక్కినేని అభిమానులకు స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తూ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ టీం తాజగా ఈ సినిమాకు సంబంధించిన కపుల్ పోస్టర్ ని విడుదల చేసింది. ఈరోజు వ‌డుద‌ల చేసిన పోస్ట‌ర్ లో అక్కినేని న‌ట‌వార‌సుడు అఖిల్ అక్కినేని వర్క్ చేసుకుంటూ ఉంటే వెనక నుంచి బుట్ట బొమ్మ పూజా హెగ్డే టీజ్ చేసే ఈ స్టిల్ చూస్తే యూత్ లో ఒక తెలియ‌ని రొమాంటిక్ ఫీల్ వ‌స్తుంది.

ఈ చిత్రానికి ఓ స్పెషాలిటీ

ద‌ర్శ‌కుడు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ త‌న చిత్రాల్లో పాత్ర‌లు చాలా క్యూట్ రొమాన్స్ తో ల‌వ్ లీగా వుండే కేర‌క్ట‌ర్స్ ని డిజైన్ చేస్తారు. అందుకే ఆయ‌న చిత్రాల‌కి ఓ స్పెషాలిటి వుంటుంది. అఖిల్ అక్కినేని పూజా ల మ‌ద్య ఎలాంటి కెమిస్ట్రి వుండ‌బోతుందో ఈ పోస్ట‌ర్ డిజైనింగ్ లో చాలా చ‌క్క‌గా చూపించారు ద‌ర్శ‌కుడు. ల‌వ్లీ ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా మెస్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ రెడి అవుతున్నాడు.

ఇప్ప‌టికే 70 పూర్త‌య్యి ల‌వ్లీ అండ్ హోల్ సం ఫ్యామిలి ఎంటెర్టైనెర్ గా తెర‌కెక్కుతున్న చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ఒక షెడ్యూల్ షూటిగ్ మాత్ర‌మే బ్యాల‌న్స్ వుంది. ఈ కొరోనా క్రైసిస్ కొంచెం త‌గ్గితే ఈ షెడ్యూల్ ని ప్లాన్ చేస్తున్నారు. అఖిల్ అక్కినేని, పూజా లు షూటింగ్ కి సిద్దంగా వున్నా బ‌య‌ట ప‌రిస్థుతుల దృష్ట్యా నిర్మాతలు బన్నీ వాసు, వాసు వర్మ లు ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్నారు.

ఆరంభం కాబోతున్న డబ్బింగ్ కార్యక్రమాలు 

ఇప్పటికే కీలకమైన సన్నివేశాలతో పాటు సింహా భాగం షూటింగ్ పూర్తి అయినట్లుగా నిర్మాతలు తెలిపారు. ఈ లాక్ డౌన్ లో గోపీసుంద‌ర్ తో మ్యూజిక్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేశారు. అలాగే అతి త్వ‌ర‌లో డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు మెద‌లు పెట్ట‌బోతున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి.

ఆమని, మురళి శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి 2021 లో జ‌న‌వ‌రి లో విడుద‌ల చేయటానికి నిర్మాతలు స‌న్నాహ‌లు చేస్తున్నారు.

న‌టీ న‌టులు: అఖిల్ అక్కినేని, పూజా హెగ్ఢే, ఆమ‌ని, ముర‌ళి శ‌ర్మ‌, జ‌య ప్ర‌కాశ్, ప్ర‌గ‌తి, సుడిగాలి సుధీర్, గెటెప్ శ్రీను, అభ‌య్, అమిత్.

టెక్నీష‌య‌న్స్: డైరెక్ట‌ర్ : బొమ్మ‌రిల్లు భాస్క‌ర్, మ్యూజిక్ : గోపీ సుంద‌ర్, సినిమాటోగ్రాఫీ : ప్ర‌దీశ్ ఎమ్ వ‌ర్మ, ఎడిట‌ర్ : మార్తండ్ కే వెంక‌టేశ్, ఆర్ట్ డైరెక్ట‌ర్ : అవినాష్ కొల్లా, నిర్మాత‌లు : బ‌న్నీ వాసు, వాసు వ‌ర్మ‌, స‌మ‌ర్ప‌ణ : అల్లు అర‌‌వింద్, బ్యానర్ : జీఏ2 పిక్చ‌ర్స్

Related posts

దివ్యాంగులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం

Bhavani

మరో సీనియర్ నేత బీఆర్ యస్ కు గుడ్ బై

Satyam NEWS

భగవద్గీత పోటీలలో ప్రథమ స్థానం సాధించిన హుజూర్ నగర్ వాసి

Satyam NEWS

Leave a Comment