ఇది తెలంగాణ నూతన సెక్రటేరియట్ భవనం. ఈ నమూనాను రాష్ట్ర మంత్రి వర్గం ఖరారు చేసింది. 600 అడుగుల పొడవు, 300 అడుగుల అడ్డం కొలతలతో కొత్త సచివాలయం నిర్మించబోతున్నారు. తూర్పు అభిముఖంగా కొత్త సచివాలయం ఉంటుంది. ఏడంతస్తుల మేడగా ఈ భారీ భవంతి నిర్మించాలని మంత్రి వర్గం నిర్ణయించింది.
ఇందులో ఒక అంతస్తు మొత్తం ముఖ్యమంత్రి కార్యాలయమే ఉంటుంది. కిటికీలన్నీ బ్లూ గ్లాస్ తో నిర్మించనున్నారు. మొయిన్ ఎంట్రన్స్ ఎలివేషన్లో ప్రసిద్ధ రాజస్థాన్ దోల్ పూర్ బీగ్ సాండ్ స్టోన్ ఉపయోగించనున్నారు. సీఎం కార్యాలయం ఉండే ఏడో అంతస్తు ఎలివేషన్ కు మంగుళూరు పెంకులలాంటి డిజైన్ ఉంటుంది.
ఆధునిక వసతులతో నూతన సచివాలయం నిర్మిస్తారు. పచ్చని తివాచీ పరిచినట్టుండే లాన్స్, ఫౌంటెన్స్ ఏర్పాటు చేయనున్నారు. పార్కింగ్ ఇబ్బంది లేకుండా సదుపాయాల కల్పన చేస్తారు.