39.2 C
Hyderabad
March 29, 2024 14: 07 PM
Slider సినిమా

శార్వానంద్, రష్మిక చిత్రం షూటింగ్ ప్రారంభం

#HeroSharvanand

తిరుపతి లోని తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వేంకటేశ్వర ఆలయంలో నేడు  సినిమా సందడి నెలకొన్నది.శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో “ఆడాళ్ళు మీకు జోహర్లు” సినిమా షూటింగ్ ప్రారంభం అయింది.

సినిమా హీరో హీరోయిన్ల్ గా నటిస్తున్న శార్వానంద్, రష్మిక మందన్న పై క్లాప్ కొట్టి ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి షూటింగ్ ప్రారంభించారు.

శ్రీలక్ష్మి వేంకటేశ్వర సినిమాస్ పథకంలో ఈ సినిమా తెరకెక్కనున్నది. ఈ చిత్రానికి డైరెక్టర్ తిరుమల కిషోర్ కాగా, నిర్మాత చెరుకూరి సుధాకర్.

సినిమా షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తో బాటు ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, మేడా మల్లికార్జున రెడ్డి హాజరయ్యారు.

చిత్ర బృందానికి చెవిరెడ్డి శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయడంతో పాటు వేద పండితుల ఆశీర్వచనం ఇప్పించారు.

షూటింగ్ ప్రారంభోత్సవానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసి సహకరించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి కి చిత్ర బృందం కృతజ్ఞతలు తెలిపింది.

Related posts

అప్పులు ఇప్పిస్తామని మోసం చేస్తున్న అంతర్ రాష్ట్ర సైబర్ ముఠా అరెస్ట్

Satyam NEWS

ఇంచార్జి ఎంపీపీగా ఉరుదొండ నరేష్

Satyam NEWS

238 మందికి ఉచిత కంటి శస్త్రచికిత్సలు

Bhavani

Leave a Comment