కరోనా లాక్ డౌన్ మరో 10 రోజుల పాటు పొడిగిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బ్యాంకుల పనివేళలు కూడా మారాయి.
లాక్ డౌన్ కు సడలింపులు తెస్తూ ప్రజల కార్యకలాపాల సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పెంచారు.
ఈ క్రమంలో రాష్ట్రంలో బ్యాంకులు ఇకపై ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తాయి.
ఈ మేరకు రాష్ట్ర బ్యాంకర్ల కమిటీ వెల్లడించింది.
ఇంతకుముందు, లాక్ డౌన్ సడలింపు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే ఉండగా… బ్యాంకులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకే పనిచేశాయి.