ఆమె ఖతార్ ఏర్ వేస్ లో ఎయిర్ హోస్టస్..అతను సినీ రంగంలో పేరు గడించిన ఆర్టిస్ట్సీ.సీన్ కట్ చేస్తే వాళ్లిద్దరూ దంపతులై, విశ్వ విఖ్యాత, నటసార్వభౌమ, తనయుడు,నటకిరీటి, హీరో నందమూరి నందమూరి బాలకృష్ణ ఆశీర్వచనం తీసుకున్నారు.
అదీ బాలయ్య బాబు జన్మదినం సందర్భంగా హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ లో ఆయన ఇంటికి వెళ్లి మరీ దీర్ఘాయుష్మానుభవ అంటూ ఆశీస్సులు పొందారు.ఈ నెల 10 నబాలయ్య బాబూ అని పిలుచుకునే నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు.
ఈ నేపధ్యంలో హైదరాబాద్ కు చెందిన తెలుగు సినీ రంగానికి చెందిన ప్రణవానంద…తన కొడుకు కోడలైన త్రినేత్ర,వైష్ణవిలతో జూబ్లీహిల్స్ లోని బాలకృష్ణ ఇంటికి వెళ్లారు. అప్పటికే ఆయనను కలవడానికి ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పేందుకు డైరక్టర్ బోయపాటితో సహా ఎందరో బయట నిరీక్షిస్తున్నారు.
కానీ అంతకుముందే బాలయ్య బాబు అపాయింట్ మెంట్ ఫిక్స్ చేసుకున్న ఆయనను ఆభిమానించే ప్రణవానంద…తన కొడుకు,కోడలిని తీసుకువెళ్లారు. చూడ ముచ్చటైన వైష్టవీత్రినేత్ర జంటను చూసి హీరో బాలకృష్ణ ఎంతో ఆనందించారు.
ఖతార్ ఏర్ వేస్ లో ప్రణవానంద కోడలైన వైష్ణవి చేస్తుందని తెలుసుకున్న నటుడు బాలకృష్ణ..ఆమెను ఏర్ వేస్ ఎలాగుందని..కరోనా మూలంగా నడుస్తున్నాయా అంటూ కుశల ప్రశ్నలు వేసారు. ఆయన పుట్టిన రోజు నాడు బాలకృష్ణను స్వయంగా కలిసిన వైష్ణవీ దంపతులు…బాలకృష్ణ కాళ్లకు దండం పెట్టారు.
దాంతో ఉబ్బితబ్బిబ్బయిపోయి….బోయపాటి సినిమాలో డైలాగ్ చెప్పే విధంగా దీర్షాయుష్మానభవ అంటూ ఆశ్వీరదించారు. అనంతరం హీరో బాలకృష్ణతో వైష్టవీదంపతులతో పాటు ప్రణవానంద కూడా ఫోటో దిగారు.