కర్ణాటక రాష్ట్రం రాయచూరు నుంచి ఒక కుటుంబానికి చెందిన ఏడుగురు తిరుమల శ్రీవారి దర్శనార్థం వస్తుండగా అనుకోని దుర్ఘటన జరిగింది. చిత్తూరు జిల్లా తిరుపతి వెస్ట్ చర్చి వద్ద నున్న అండర్ బ్రిడ్జి వద్ద భారీ వర్షానికి నిలిచి నీటిలో మునిగి నవ వధువు దుర్మరణం చెందింది.
వెస్ట్ చర్చి వద్ద అండర్ బ్రిడ్జి లోకి భారీగా చేరుకున్న వర్షపు నీటిలో చిక్కుకున్న ఏడుగురితో ప్రయాణిస్తున్న తుఫాన్ వాహనం లో నవ వధువు సంధ్య మృతి చెందగా, మరో చిన్నారికి అస్వస్థత గురయ్యింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి పరిస్థితి నిలకగావుంది. ఎస్ వి యూనివర్సిటీ పోలీసులు మిగిలిన కుటుంబ సభ్యులను కాపాడారు.