నవ వధువు వరకట్నపు వేధింపులు భరించలేక ఉరేసుకొని చనిపోయిన సంఘటన రంగారెడ్డి జిల్లా నడిగడ్డ తండా లో చోటు చేసుకుంది.
మియాపూర్ ఎస్ఐ మౌనిక తెలిపిన వివరాల ప్రకారం నాగర్కర్నూల్కు చెందిన రాహుల్ అలియాస్ మున్నాకు ఏ.సోని(20)తో ఈ ఏడాది జనవరి 8న వివాహం జరిగింది.
వారు మియాపూర్ నడిగడ్డ తండాలో నివాసం ఉంటున్నారు. మున్నా స్థానికంగా బైక్ మెకానిక్గా విధులు నిర్వహిస్తుండగా సోని గృహిణి. సోని శనివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
దీంతో ఆమె కుటుంబ సభ్యులు మియాపూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా మున్న వరకట్నం తీసుకురావాలంటూ సోనినీ తరచూ వేధించేవాడని, ఈ క్రమంలోనే మనస్థాపం చెంది సోని ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవఖానకు తరలించారు.