32.7 C
Hyderabad
March 29, 2024 12: 46 PM
Slider రంగారెడ్డి

వ‌ర‌క‌ట్న వేధింపులు భరించలేక న‌వ‌వ‌ధువు ఆత్మహత్య

#dowrydeath

నవ వధువు వరకట్నపు వేధింపులు భరించలేక ఉరేసుకొని చనిపోయిన సంఘటన రంగారెడ్డి జిల్లా నడిగడ్డ తండా లో    చోటు చేసుకుంది.

మియాపూర్ ఎస్ఐ మౌనిక తెలిపిన వివ‌రాల ప్ర‌కారం నాగ‌ర్‌క‌ర్నూల్‌కు చెందిన రాహుల్ అలియాస్ మున్నాకు ఏ.సోని(20)తో ఈ ఏడాది జ‌న‌వ‌రి 8న వివాహం జ‌రిగింది.

వారు మియాపూర్ న‌డిగ‌డ్డ తండాలో నివాసం ఉంటున్నారు. మున్నా స్థానికంగా బైక్ మెకానిక్‌గా విధులు నిర్వ‌హిస్తుండ‌గా సోని గృహిణి.  సోని శ‌నివారం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల ప్రాంతంలో ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది.

దీంతో ఆమె కుటుంబ స‌భ్యులు మియాపూర్ పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేయగా మున్న వ‌ర‌క‌ట్నం తీసుకురావాలంటూ సోనినీ త‌ర‌చూ వేధించేవాడ‌ని, ఈ క్ర‌మంలోనే మ‌న‌స్థాపం చెంది సోని ఆత్మ‌హ‌త్య చేసుకుంద‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ మేర‌కు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ద‌వ‌ఖాన‌కు త‌ర‌లించారు.

Related posts

రోడ్డు వేయని కాంట్రాక్టర్ కు ఎదురు డబ్బు ఇచ్చిన కార్పొరేటర్

Satyam NEWS

హైకోర్టు వ్యాఖ్యల దృష్ట్యా సజ్జలను ఏదో ఒక పదవికి పరిమితం చేయండి

Satyam NEWS

60 కిమీ లకు ఒక టోల్‌ప్లాజా

Sub Editor 2

Leave a Comment