తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులను కీలక పాత్ర పోషిస్తున్న వారిని ఒక్కొక్కరిగా కేసులు పెట్టడమో, అరెస్టులు చేయడమో చేస్తున్న వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తాజాగా సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిని టార్గెట్ గా చేసుకుంటున్నట్లు టిడిపి మహిళా అధ్యక్షురాలు అనిత కామెంట్ చేస్తున్నారు.
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడును ఎలాగైనా అరెస్ట్ చేయాలని అనుకుంటున్నారని అనిత వ్యాఖ్యానించారు. అదీ కూడా దారుణంగా నిర్భయ కేసు పెట్టేందుకు అన్ని పథకాలు రచిస్తున్నారని ఆమె అన్నారు.
శాసనమండలిలో ఇష్టానుసారంగా మాట్లాడిన మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, వెల్లంపల్లి శ్రీనివాస్ పై ఎందుకు కేసులు పెట్టలేదు? శాసన మండలిలో మహిళల ముందే చేయరాని పనులు చేసిన అనిల్ కుమార్ యాదవ్ ,వెల్లంపల్లి శ్రీనివాస్ పై నిర్భయ కేసులు పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు.