ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసినా తాను భయపడేది లేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ వెంకటరామిరెడ్డి అన్నారు.
సాయి ప్రసాద్ అనే ఉద్యోగి సెలవులు అడిగారని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ డిస్మిస్ చేశారని ఆయన అన్నారు.
రెండు నెలల్లో కొత్త ఎన్నికల కమిషనర్ వస్తే మళ్ళీ ఆయన్ని విధుల్లోకి తీసుకుంటామని వెంకటరామిరెడ్డి అన్నారు.
ఎన్నికల గురించి ఎప్పుడు ఈ విధంగా ఉద్యోగులు రోడ్డు పైకి రాలేదు. సస్పెండ్ చేయడం గురించి ఎవరూ భయపడరు అని ఆయన అన్నారు.
జిల్లాల కలెక్టర్ని కాదని జాయింట్ కలెక్టర్తో ఎన్నికల కమిషనర్ మాట్లాడుతున్నారని, దాని వల్ల ఒత్తిడి పెరుగుతుందే తప్ప ఉపయోగం ఉండదని ఆయన అన్నారు.
ఉద్యోగులు ఎవ్వరూ సస్పెండ్ చేస్తారని భయపడొద్దు. ఎంత మందిని సస్పెండ్ చేస్తారు..? అని వెంకటరామిరెడ్డి ప్రశ్నించారు.