ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ కార్యాలయాన్ని నేడు ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎం.సీతారామమూర్తి ప్రారంభించారు. కర్నూలు లోని ఏపీ స్టేట్ గెస్ట్ హౌస్ లో ఈ కార్యాలయం ప్రారంభం అయింది.
అంతకు ముందు హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ ఎం. సీతారామమూర్తి, జ్యుడీషియల్ సభ్యుడు దండే సుబ్రహ్మణ్యం, నాన్ జ్యుడీషియల్ సభ్యుడు జి. శ్రీనివాస రావు లకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వేదపండితులు పూర్ణ కుంభతో స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ, రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) శ్రీనివాసులు, డి.ఆర్.ఓ పుల్లయ్య, జెడ్పి సీఈఓ వెంకటసుబ్బయ్య, కర్నూలు ఆర్.డి.ఓ హరిప్రసాద్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆదిశేషు నాయుడు తదితరులు పాల్గొన్నారు. రూమ్ నెంబర్-1 ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎం.సీతారామమూర్తి ఛాంబర్ గా ఉంటుంది. జ్యుడీషియల్ సభ్యుడు దండే సుబ్రహ్మణ్యం ఛాంబర్ రూమ్ నెంబర్ – 2 లో ఉంటుంది. నాన్ జ్యుడీషియల్ సభ్యుడు జి.శ్రీనివాస రావు ఛాంబర్ రూమ్ నెంబర్ -4 లో ఉంటుంది.