దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో NIA సోదాలు నిర్వహించింది. గుజరాత్, గోద్రా, బుల్దానా, మహారాష్ట్ర, విశాఖలో ఎన్ఐఏ సోదాలు చేసింది. దేశానికి చెందిన కీలక సమాచారాన్ని నేవీ అధికారుల ద్వారా పాక్ గూఢాచారులు తస్కరించినట్లు NIA గుర్తించింది. నేవీ అధికారులను మనీ ట్రాప్ కేసులో ఇరికించడంతో ఎన్ఐఏ సోదాలు చేసింది. విశాఖలో 12 మంది నేవీ అధికారులను పాక్ గూఢాచారులు మనీట్రాప్ చేశారు. దీంతో ముంబై, గుజరాత్, విశాఖలో పలువురిని NIA అదుపులోకి తీసుకున్నది. 4 చోట్ల సోదాల్లో ఎలక్ట్రానిక్ డివైజర్స్, సిమ్కార్డులు, పలు కీలక పత్రాలను స్వాధీనం NIA అధికారులు చేసుకున్నారు.