ప్రముఖ సినీ నటుడు నాగబాబు కుమార్తె, నటి నిహారిక తన భర్త చైతన్యతో కలిసి అన్నవరం సత్యనారాయణ స్వామిని నేడు దర్శించుకున్నారు.
9న చైతన్య జొన్నలగడ్డతో నిహారిక వివాహం జరిగిన సంగతి తెలిసిందే. 11న హైదరాబాద్లో వీరి వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించారు. నేడు అత్తా మామలతో కలిసి సత్యనారాయణస్వామివారిని దర్శించుకున్నారు.
ప్రత్యేక పూజలో పాల్గొన్న వీరికి పండితులు తీర్థ ప్రసాదాలు అందించారు.