37.2 C
Hyderabad
March 29, 2024 21: 01 PM
Slider నిజామాబాద్

ట్రాజెడీ:పెళ్ళైన రోజే బరాత్లో వరుడి మృతి

nijamabad bodhan bride groom dead in marrige barath

నిజామాబాద్‌ జిల్లా బోధన్ పట్టణంలో పెళ్లింట విషాదం నెలకొంది. పెళ్లి వేడుకలో నిర్వహించిన బారాత్‌ లోని డీజే సౌండ్స్ పడక అస్వస్థతకు గురై వివాహమైన కొద్దిసేపటికే వరుడు మంగళి గణేశ్(25) మృతి చెందాడు.శుక్రవారం మధ్యాహ్నం గణేశ్‌కు వివాహం జరిగింది. అప్పగింతలు కార్యక్రమం అయ్యాకా రాత్రి పెళ్లి వేడుకలో భాగంగా బారాత్‌ నిర్వహించారు. డీజే సౌండ్‌కు అస్వస్థతకు గురైన గణేశ్‌ ఒక్కసారిగా అక్కడికక్కడే కుప్పకూలాడు.

అప్రమత్తమైన బంధువులు వెంటనే గణేష్ ను నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాత్రి 2గంటల సమయంలో గుండెపోటుతో వరుడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈఘటనతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.

నూరేళ్లు తోడుంటానని ప్రమాణం చేసి ఇంటికి తీసుకువచ్చిన భర్త కొద్ది సేపటికే దూరమయ్యాడంటూ వధువు, బంధువుల రోదనలు మిన్నంటాయి. అప్పటి వరకు తమతో హుషారుగా నృత్యం చేసిన వరుడు మృతి చెందడంతో బంధుమిత్రులు విషాదంలో మునిగిపోయారు

Related posts

రోజుకు 80 వేల మందికి వైకుంఠ ద్వార దర్శనం

Murali Krishna

జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి

Satyam NEWS

నేపాల్ భూ భాగాన్ని ఆక్రమించిన చైనా?

Satyam NEWS

Leave a Comment