39.2 C
Hyderabad
April 25, 2024 18: 58 PM
Slider ప్రత్యేకం

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ పునర్ నియామకం

#Nimmagadda Rameshkumar

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ ను పునర్ నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం శుక్రవారం లోపు ఆయనను మళ్లీ నియమించాల్సి ఉంది. ఆఖరు నిమిషం వరకూ వేచి చూసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం అర్ధరాత్రి ఆయనను పునర్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్ర గవర్నర్ పేరుతో పంచాయితీరాజ్ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్ రమేష్ కుమార్ ను కొనసాగించాలని రాష్ట్ర హైకోర్టు తీర్పు చెప్పినా కాదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ కూడా చుక్కెదురు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.

Related posts

ఏ క్షణమైనా ఏపి సిఎం జగన్ బెయిల్ రద్దు..

Satyam NEWS

ఆధ్యాత్మిక రాజధానిలో ఎంజీఆర్ బంపర్ డ్రా

Satyam NEWS

శ్రీశైలంలో బ్రిటిష్ కాలం నాటి బంగారు నాణాలు లభ్యం

Satyam NEWS

Leave a Comment