టీచర్లు, ఉద్యోగుల ఐ.ఆర్,పి.ఆర్.సి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆదేశాల మేరకు ఈరోజు నిర్మల్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను బిజెపి నాయకులు ఎండగట్టారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర విత్తన పాలకమండలి సభ్యులు అయ్యన్న గారి భూమయ్య ,కృష్ణా గోదావరి జలాల రాష్ట్ర కన్వీనర్ రావుల రాంనాథ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఒడిశల శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శులు సామ రాజేశ్వర్రెడ్డి, మెడిసెమె రాజు, మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ అప్పాల గణేష్ ,
జిల్లా ఉపాధ్యక్షులు కమల్ నయన్, నల్ల రమేష్, పడాల రాజశేఖర్, జిల్లా కార్యదర్శులు గాదె విలాస్, మిట్టపల్లి రాజేందర్, దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు రాచకొండ సాగర్, పట్టణ అధ్యక్షులు సాదం అరవింద్, అసెంబ్లీ నాయకులు కొరిపెల్లి శ్రవణ్రెడ్డి,
మాజీ జిల్లా ఉపాధ్యక్షులు అంజు కుమార్ రెడ్డి, ఆడెపు సుధాకర్, పెంబి మండల జెడ్పీటీసీ జానకి బాయి, కౌన్సిలర్లు కత్తి నరేందర్, మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.