నిర్మల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన అవార్డులలో నిర్మల్ అధికారులు సత్తా చాటారు. చట్టబద్ధంగా, ప్రశాంతంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించినందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అవార్డులను డిసెంబర్ లో ప్రకటించింది.
ఇందులో నిర్మల్ జిల్లాలోని జిల్లా పంచాయతీ అధికారి పీ.శ్రీనివాస్, జిల్లా సహకార అధికారి సూర్యచంద్రరావు, సి.ఐ.(రిటైర్డ్) యం.ఎ.కరీం, లక్ష్మణ్చందా, లోకేశ్వరం ఎంపీడీవోలు యం.మోహన్, ఎ.గంగాధర్ ఉన్నారు. వీరికి వచ్చిన డెమోక్రసీ అవార్డులలను నేడు హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళ సై సుందరరాజన్ అందచేశారు.