కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన సినీ నటుడు నితిన్ వివాహం జరిగేందుకు ముహూర్తం ఖరారైంది. నేడు నితిన్, శాలినిల నిశ్చితార్థం వేడుక నిరాడంబరంగా జరిగింది. కరోనా కారణంగా కేవలం కొంత మందిని మాత్రమే నిశ్చితార్థం కార్యక్రమానికి ఆహ్వానించారు.
ఈ నెల 26న వారి వివాహం జరుగుతున్నది. పరిమిత సంఖ్యలోనే పెళ్లికి కూడా అతిధులను ఆహ్వానించారు. 26న రాత్రి 8.30కి హైదరాబాద్ లోని ఫలక్ నుమా ప్యాలెస్ లో వివాహం జరగనుంది.