నివర్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు 35 వేల రూపాయలు పరిహారంగా అందించాలని, తక్షణ సాయంగా పది వేల రూపాయలు ఇవ్వాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఈ నెల 28వ తేదీన కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ.ఎం.డి.ఇంతియాజ్ కి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వినతి పత్రం అందజేయనున్నట్లు జనసేన పార్టీ తెలిపింది.
28న ఉదయం తొమ్మిది గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి గుడివాడ, పెడన మీదుగా మచిలీపట్టణానికి పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. అనంతరం కలెక్టరేటులో కలెక్టర్కు వినతి పత్రం అందచేస్తారు. రైతులు, కౌలు రైతుల ఉజ్వల భవిష్యత్తు కోసం జనసేన తలపెడుతున్నజైకిసాన్ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ కార్యాలయాలలో రైతులు పక్షాన విజ్ఞాపన పత్రాలు సమర్పించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.