ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జడ్పీ చైర్మన్ గా పనిచేసిన అశోక్ రాజ ఇకలేరు. శనివారం రాత్రి హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 1984 లోఅప్పటి చైర్మన్ కెవి నారాయణరెడ్డి సెలవులో వెళ్లడంతో ఆయన స్థానంలో వైస్ చైర్మన్ గా ఉన్న అశోక్ రాజా జడ్పీ చైర్మన్ గా రెండు సంవత్సరాలు బాధ్యతలు నిర్వహించారు. మద్నూరు పంచాయతీ సమితి చైర్మన్ గా కూడా ఆయన గతంలో కొనసాగారు. జుక్కల్ మండలంలోని కౌలాస్ గ్రామం ఆయన స్వస్థలం.
previous post