వాడు వీడు లేదు అన్న చందంగా ఈ కరోనా సెకండ్ వేవ్ ప్రతీ ఒక్కరినీ బలి తీసుకుంటోంది. ఈ సెకండ్ వేవ్ ఎక్కువ మంది జర్నలిస్టులే బలవుతున్న సంఘనటలు జరుగుతున్నాయి.
అమరావతి నుంచీ సిక్కోలు వరకు అధిక సంఖ్యలో జర్నలిస్టులే ఈ కరోనా సెకండ్ వేవ్ కు ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. ఈ సంఘటలతో పేర్కొన్న ఏపీయూడబ్య్యూజే విజయనగరం జిల్లా శాఖ జిల్లా కలెక్టర్ కు డీపీఆర్ఓ ద్వారా విజ్ఞప్తి చేయడంతో ఎట్టకేలకు తిరుమల హాస్పటల్స్ లో జర్నలిస్టుల కోసం బెడ్ లు కేటాయించారు.
ఇదిలా ఉంటే .తిరుమల ఆసుపత్రి ఎవరరికి బెడ్ లు కేటాయించడం లేదన్న వాదన కూడా వినిపిస్తోంది. .ప్రస్తుతానికి డా. శ్రీరామ మూర్తి ఆసుపత్రిలోనే జర్నలిస్టులకు బెడ్ లు కేటాయించినట్టు తెలుస్తోంది.
ఇక ఆ రెండు హాస్పటల్స్ యాజమాన్యం కూడా కలెక్టర్ లిఖిత పూర్వకంగా రాసి ఇస్తేనే అడ్మిట్ చేసుకుంటామని చెబుతుండటం విశేషం.కాని తెల్లవారి లేచింది మొదలు అర్ధ రాత్రి వరకు..ఎవరెవరో మిత్రులు, ఎక్కడెక్కడి వారో ఫోన్లు చేసి వైద్య సాయం అడుగుతున్నారు అందుబాటులో ఉన్నవారు..తెలిసిన డాక్టర్ వద్దకు వెళ్లమని చెబుతున్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో కలం పట్టే ఓ జర్నలిస్టే నాయకత్వం వహించి…ఈ మహమ్మారి బారిన పడ్డవారికి అండగా నిలిస్తే..ఈ విధమైన ఆలోచన యూనియన్ తో సంబంధం లేకుండా మానవతా కోణంలో ఆలోచించి ముందుకు రావల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఎం.భరత్ కుమార్, సత్యం న్యూస్