వనపర్తి పట్టణంలో హోమ్ క్వారంటయిన్, ఇండ్లల్లో ఉంటున్న కరోనా బాధితులకు సేవలందించడంలో అధికారులు విఫలమయ్యారు. సమీక్షలు, తనిఖీలు,పర్యవేక్షణ లేదు. కరోనా ఉన్నవారికి 10 రోజులు, 14 రోజుల తరువాత మళ్ళీ కరోనా టెస్టింగ్ చేయడం లేదు.
కరోనా ఉన్న వారు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి, గాంధీనగర్,టీచర్స్ కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్లకు వెళ్ళినా కరోనా కిట్లు లేవని మళ్ళీ రావాలని క్రింది స్థాయి సిబ్బంది చెబుతున్నారు. ఇండ్లల్లో ఉన్న తమకు మందులు ఇవ్వడంలేదని, ఫోన్ చేసినా స్పందన లేదని సుమంత్ చెప్పారు.
ఇండ్లల్లో ఉన్న కరోనా వారికి ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేయాలని, కరోనా కిట్లు అందుబాటులో ఉంచాలని బాధితులు కోరుతున్నారు. కరోనా టెస్టింగ్ కోసం వచ్చిన వారికి టోకెన్ ఇచ్చే పద్ధతి బంద్ చేయాలని, టోకన్ పద్ధతి గురించి ఏ చట్టంలో ఉంది? ప్రభుత్వ జీవో ఉందా అని బాధితులు ప్రశ్నించారు.
కరోనా ఉన్న వారికి సామాజిక దూరం ఏర్పాటు చేసి,అందరికి కరోనా టెస్టింగ్ చేయాలని కోరుతున్నారు. అదే విధంగా అన్ని వార్డుల్లో కరోనా టెస్టింగ్, కరోనా కిట్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. వనపర్తిలో విలేకరులకు ప్రత్యేకంగా కౌంటర్, ప్రత్యేక వార్డు,సేవలు ఏర్పాటు చేయలేదు.