కరోనా వ్యాక్సిన్ రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం లింగగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గురువారం ఆరోగ్య సిబ్బందికి, అంగన్వాడీ సిబ్బందికి కోవిడ్ – 19 వాక్సిన్ అందించినట్లు మండల వైద్యాధికారి డాక్టర్ లక్ష్మణ్ గౌడ్ తెలిపారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ టీకా పై ఎవరు సందేహించాల్సిన అవసరం లేదని, వ్యాక్సిన్ భద్రతపై సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలకు ప్రాధాన్యత ఇవ్వవద్దని కోరారు.
వాక్సిన్ పూర్తిగా సురక్షితమని అన్నారు.గడిచిన రెండు రోజులుగా హుజూర్ నగర్ మండల పరిధిలో వాక్సిన్ తీసుకున్న వారిలో గుర్తించదగిన దుష్పరిణామాలు ఏమీ లేవని అన్నారు.
రెండవ రోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లింగగిరి నందు 68,ఏరియా హాస్పటల్ నందు 16, హుజూర్ నగర్ మండల పరిధిలో మొత్తం 84 మందికి టీకా అందించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో C. D. P. O విజయలక్ష్మి, ఇందిరాల రామకృష్ణ, ఉదయగిరి శ్రీనివాస్, మంగమ్మ, అలివేలు మంగ, మాధవి, సంతోషం, ఉపేందర్ ఆశ,అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.