27.7 C
Hyderabad
April 20, 2024 00: 37 AM
Slider అనంతపురం

భక్తులకు ఎలాంటి సౌకర్యం కల్పించని మునిసిపల్ అధికారులు

#anantapuram

అయ్యప్ప, ఆంజనేయ, శివ మాలధారణ చేసే వారికి అనంతపురం మున్సిపల్ అధికారులు ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనంతపురం హెచ్ ఎల్ సి కెనాల్ దగ్గర ప్రతి ఏటా ఎంతో మంది భక్తి శ్రద్దలతోఅయ్యప్ప, ఆంజనేయ, శివ మాల ధారణ వేసి స్నానాలు చేస్తుంటారు. అనంతపురం మున్సిపల్ అధికారులు కనీసం మౌలిక సదుపాయాలు కల్పించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు.

ఈరోజు స్వాములు అందరు బిజెపి నాయకులని కలసి వారి సమస్యలను విన్నవించుకున్నారు. రాష్ట్ర  ప్రభుత్వం హిందువుల పట్ల ,హిందూ సంస్కృతీ పట్ల తన వ్యతిరేక వైఖరిని ప్రదర్శించే విధానాన్ని బిజెపి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. బిజెపి తప్పకుండా స్వాముల తరపున పోరాటం చేస్తుందని నాయకులు హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు  పాల్గొన్నారు.

సత్యం న్యూస్.నెట్, అనంతపురం

Related posts

చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

Satyam NEWS

పాతబస్తీ ఇక మా అడ్డా అవుతుంది: బండి సంజయ్

Satyam NEWS

డెత్ ప్లే : ప్రమాదవశాత్తు అమెరికాలో వైద్య విద్యార్థి మృతి

Satyam NEWS

Leave a Comment