కరోనా మొదటి దశ తర్వాత ఏం గుణపాఠం నేర్చుకున్నామో తెలియదు…. రెండో దశలోనూ అవే సీన్ లు…. ఎంత నిర్లక్ష్యం… ఎంత దౌర్భాగ్యం….
కడప నగరంలో ఏర్పాటు చేసిన హజ్ హౌస్ లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కరోనా కేంద్రంలోని దారుణ పరిస్థితి ఇది. హజ్ హౌస్ కొవిడ్ కేంద్రంలో కోవిడ్ బాధితులు ఆకలి కేకలు వేస్తున్నారు.
ఫాతిమా కొవిడ్ సెంటర్ నుంచి నిన్న మధ్యాహ్నం హజ్ హౌస్ సెంటర్ కు అంబులెన్స్ లో రోగులను అధికారులు తరలించారు.
ఆ తర్వాత హజ్ హౌస్ లో వారిని వదిలి తాళం వేసేశారు. రాత్రి పది గంటలకు చాలీచాలని ఆహారం అందించారు.
ఇంత వరకు ఎవ్వరు అటు వైపు తొంగిచూడలేదు.
రాత్రంతా జ్వరం, దగ్గుతో రోగులు బాధపడ్డారు. నేటి ఉదయం కూడా ఆహారం కోసం రోగులు ఎదురుచూపులు చూడాల్సి వచ్చింది. తాళం వేయడంతో బయటకు రాలేని పరిస్థితి ఉంది.