39.2 C
Hyderabad
April 18, 2024 16: 17 PM
Slider ఆధ్యాత్మికం

భక్తులు లేక తిరుమల తిరుపతి వెలవెల

#TirumalaTirupathi

పవిత్ర పర్వదినం అయిన శ్రావణ శుక్రవారం నాడు కిటకిటలాడాల్సిన తిరుమల తిరుపతి బోసిపోతున్నది. వేల సంఖ్యలో ఉండాల్సిన భక్తులు పదులు సంఖ్యలో కూడా కనిపించడం లేదు. శుక్ర, శని, ఆదివారాలలో కిటకిటలాడే తిరుమల నేడు బోసి పోయి కనిపించింది.

రోజుకు వెయ్యి మంది వరకూ దర్శనానికి టిక్కెట్లు జారీ చేస్తున్నారు. భౌతిక దూరం పాటిస్తూ దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. అయితే కరోనా విజృంభణ కారణంగా ఎక్కడా నరసంచారం కనిపించడం లేదు. తిరుమల కాటేజీల దగ్గర సందడే లేదు. షాపింగ్ కాంప్లెక్స్ బోసిపోయింది.

ప్రధాన ఆలయం పరిసరాల్లో ఒకరు ఇద్దరు తప్ప గుంపులు గుంపులుగా భక్తులు కనిపించడం లేదు. గత కొద్ది నెలలుగా ఉన్న ఈ పరిస్థితి మరి ఎంత కాలం కొనసాగుతుందో అర్ధం కావడం లేదు.

Related posts

పార్లమెంటు సభ్యులకు ఇక ఆ సౌకర్యం కట్

Satyam NEWS

ములుగులో శరన్నవరాత్రి ఉత్సవాలు మొదలు

Satyam NEWS

13 న విజయనగరానికి ఏపీ రాష్ట్ర డీజీపీ…!

Satyam NEWS

Leave a Comment