లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేయడం వల్లనే జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం గలిగామని వచ్చే నెల 7 వరకు నిర్మల్ జిల్లాలో లాక్ డౌన్ లో ఎలాంటి సడలింపులు ఉండవని జిల్లా ఎస్పీ శశిధర్ రాజు అన్నారు. ఈరోజు నిర్మల్ రూరల్ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు.
నిర్మల్ జిల్లా ప్రజల సహకారంతో ఇప్పటివరకు లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేయడం వల్ల కరోనా వైరస్ కమ్యూనిటీ స్ప్రెడ్ ను ఆపగలమని తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి సామాజిక దూరాన్ని పాటించడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి వీలు కలిగిందని ఆయన అన్నారు.
గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు ఆరుగురు ఇటీవల డిశ్చార్జి అయ్యారని నిర్మల్ జిల్లాలో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడింది అని అన్నారు. ఇదే స్ఫూర్తితో జిల్లా ప్రజలు మే నెల 7 వరకు సహకరించాలని ఆయన కోరారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అత్యవసరాలకు మాత్రమే అనుమతి ఉంటుందని రాత్రిపూట పూర్తిస్థాయిలో కర్ఫ్యూ కొనసాగుతుంది అని తెలిపారు.
కంటైన్ మెంట్ ప్రాంతాల్లో ఇప్పటివరకు ఉన్న విధంగా ఆంక్షలను కఠినంగా అమలు చేస్తామని ప్రజలు అనవసరంగా రోడ్లపైకి రావద్దని కోరారు. అత్యవసరమైతే ద్విచక్రవాహనంపై ఒక్కరూ కార్లలో ఇరువురికి మాత్రమే అనుమతి ఉందని అంతకుమించి ప్రయాణిస్తే వాహనాలను జప్తు చేస్తామని చెప్పారు.
ఈ సమావేశంలో పట్టణ సిఐ జాన్ దివాకర్, రూరల్ సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్బి ఇన్స్పెక్టర్ వెంకటేష్, డిసీఆర్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.