26.2 C
Hyderabad
February 14, 2025 00: 58 AM
Slider విజయనగరం

బంగ్లాదేశ్ లో హిందువుల‌కు ర‌క్ష‌ణ లేదు

#bangladesh

పొరుగు దేశ‌మైన బంగ్లాదేశ్ లో జ‌రుగుతున్న మార‌ణ కాండ‌పై హిందువులంతా పున‌రాలోచించాలంటూ విజ‌య‌న‌గ‌రంలో హిందూ సంఘాల‌న్నీ గ‌ళమెత్తాయి. ఆ దేశంలో  హిందూ సంస్క్ర‌తిపై పోరాడుతున్న ఇస్కాన్ లాంటి ధార్మిక సంస్త‌ల‌ను ఎద‌గ‌నీయ‌కుండా కొన్ని సంఘాలు  దాడులు, అప‌హ‌ర‌ణ‌ల‌కు పాల్ప‌డ‌టం సిగ్గు చేట‌ని హిందూ సంఘాలు ముక్త కంఠంతో ఖండించాయి. ఈ మేర‌కు విజ‌య‌న‌గ‌రంలో కోట జంక్ష‌న్ నుంచీ మూడు లాంత‌ర్లు, గంట‌స్థంభం వ‌ర‌కు ఐక్య‌తా ర్యాలీ పేరుతో టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ, ఏబీవీపీ, వీహెచ్పీ హిందువుల ఐక్య‌త వ‌ర్దిల్లాలి అంటూ సామూహికంగా ర్యాలీ నిర్వ‌హించాయి.

ఈ సంద‌ర్బంగా ఆర్.ఎస్.ఎస్, విభాగ్ సంఘ ఛాల‌క్ కృష్ణం రాజు మాట్లాడుతూ ఆదేశంలో హిందూ సంస్క్ర‌తికై పోరాడుతున్న ఇస్కాన్ కు చెందిన వ్య‌క్తిపై దాడులు జ‌ర‌గ‌డం ఆపై ఆ కేసును వాదిస్తున్న లాయ‌ర్ ను అతి కిరాత‌కంగా అంత‌మొందించ‌డం హేయ‌మైన చ‌ర్య అని అన్నారు. దీన‌కంత‌టికీ వెన‌క ఓ ముస్లిం సంస్త ఉంద‌ని కేంద్ర నిఘా వ‌ర్గాలు ఇప్ప‌టికే గుర్తించాయ‌ని పేర్కొన్నారు. ఇలాంటి ప‌రిస్తితుల్లో హిందువులంతా ఏకం కావ‌ల్సిన స‌మ‌యం ఏర్ప‌డింద‌న్నారు. అందు కోసమే విజ‌య‌న‌గ‌రంలో హిందూ సంఘాల‌న్నీ ఏక‌త్రాటిపైకి వ‌చ్చి ర్యాలీ నిర్వ‌హించాయ‌ని చెప్పారు. ఈ కార్య‌క్ర‌మంలో వీహెచ్పీ నేత‌లు గాడేప‌ల్లి సుంద‌ర్, ఆర్.ఎస్.ఎస్ నేత‌లు దేశ‌రాజు అప్పారావు, ముని కేశవ్, గీతారెడ్డి, వెంక‌ట‌ప‌తిరాజు,మ‌ణికంఠ‌ త‌దిత‌ర‌లు పాల్గొన్నారు.

Related posts

ప్రజాఉపయోగానికి ఖర్చు చేయాల్సిన నిధులు చర్చికి ఇస్తారా?

Satyam NEWS

తిరుచానూరు పద్మావతీ అమ్మవారికి కాసుల మాల

Satyam NEWS

చెత్తను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేయాలి

Satyam NEWS

Leave a Comment