ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొరుగు సేవల ఉద్యోగస్తులు వారిపై ఆధారపడిన కుటుంబాల ఆర్థిక పరిస్థితి రోజు రోజుకి అత్యంత హీనంగా దిగజారిపోతున్నది.
పొరుగు సేవల ఉద్యోగస్తులకు జీతాలు కోసం నెలల తరబడి వేచిఉండే పరిస్థితి నెలకొని ఉంది. రాష్ట్రంలో విద్య, వైద్యం, ప్రభుత్వ ఇతర శాఖల్లో 70 వేలకు మందికి పైగా వివిధ విభాగాలలో చాలా కాలం నుంచి పని చేస్తున్నారు.
ఐదేళ్ల నుంచి పదేళ్లుగా పని చేస్తున్నావారు కూడా ఉన్నారు. ఉద్యోగం పర్మినెంటు కావడం సంగతి ఎలా ఉన్నా గత నాలుగు నెలల వరకూ కూడా జీతాలు సమయానికి వచ్చేవి.
ఉద్యోగస్తులకు జీతాలు వ్యక్తిగత ఖాతాలో పడేవి. అయితే గత నాలుగు నెలల నుంచి వారికి సకాలంలో జీతాలు రావడం లేదు. జీతాలు వచ్చి నాలుగు నెలలు అయింది.
దీంతో పొరుగు సేవల ఉద్యోగస్థులు అలో లక్ష్మణా అంటూ వాపోతున్నారు.