36.2 C
Hyderabad
April 25, 2024 21: 25 PM
Slider ముఖ్యంశాలు

పొరుగు సేవల సిబ్బందికి జీతాలు రావటం లేదు

#OutsourcingJobs

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొరుగు సేవల ఉద్యోగస్తులు వారిపై ఆధారపడిన కుటుంబాల ఆర్థిక పరిస్థితి  రోజు రోజుకి  అత్యంత హీనంగా దిగజారిపోతున్నది.

పొరుగు సేవల ఉద్యోగస్తులకు జీతాలు కోసం నెలల తరబడి వేచిఉండే పరిస్థితి  నెలకొని ఉంది. రాష్ట్రంలో విద్య, వైద్యం, ప్రభుత్వ ఇతర శాఖల్లో 70 వేలకు మందికి పైగా వివిధ విభాగాలలో చాలా కాలం నుంచి పని చేస్తున్నారు.

ఐదేళ్ల నుంచి పదేళ్లుగా పని చేస్తున్నావారు కూడా ఉన్నారు. ఉద్యోగం పర్మినెంటు కావడం సంగతి ఎలా ఉన్నా గత నాలుగు నెలల వరకూ కూడా జీతాలు సమయానికి వచ్చేవి.

ఉద్యోగస్తులకు జీతాలు వ్యక్తిగత ఖాతాలో పడేవి. అయితే గత నాలుగు నెలల నుంచి వారికి సకాలంలో జీతాలు రావడం లేదు. జీతాలు వచ్చి నాలుగు నెలలు అయింది.

దీంతో  పొరుగు సేవల ఉద్యోగస్థులు అలో లక్ష్మణా అంటూ వాపోతున్నారు.

Related posts

సీరియల్ కిల్లర్: మర్డర్లే వీడికి జీవనోపాధి

Satyam NEWS

ఇండోర్ స్టేడియం అభివృద్ధి కి కృషి: ఎమ్మెల్యే కోలగట్ల

Satyam NEWS

ఆధార్ సేవల కోసం పోస్టాఫీసులో ప్రత్యేక కౌంటరు ఏర్పాటు

Satyam NEWS

Leave a Comment