35.2 C
Hyderabad
April 20, 2024 17: 07 PM
Slider గుంటూరు

ఊరిస్తూ…..ఉసూరుమనిపిస్తూ….. మర్రికి ఎమ్మెల్సీ…

#marrirajasekhar

మాటతప్పను మడమ తిప్పను అని చెప్పే వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో సారి మాట తప్పడం, మడం తిప్పడం చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలో బహిరంగంగా ఇచ్చిన మాటను వై ఎస్ జగన్ తప్పారు. విషయం ఏమిటంటే YS రాజశేఖర్ రెడ్డి అనుచరుడుగా ఎంతో గుర్తింపు పొందిన మర్రి రాజశేఖర్ వైయస్సార్ పార్టీ ఆవిర్భావం నుంచి కీలక వ్యక్తి గా పనిచేశారు.

ప్రతిపక్షంలో ఉండగా పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వకపోయినా కిమ్మనకుండా మిన్నకుండిపోయారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన జగన్ తాము గెలిస్తే మర్రికి సముచిత స్థానం కల్పిస్తామని బహిరంగంగా చెప్పారు. మాట ఇచ్చిన వాడు మనవాడైతే ఎక్కడున్నా వడ్డించక పోతాడా అంటూ ఆయన ఇంతకాలం ఎదురు చూశారు…. అభిమానులకు, నమ్మిన కార్యకర్తలకు సర్ది చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు.

ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ సమయంలో మర్రి కి చోటు అంటూ రాజకీయ రాయబారులను పంపిస్తూ నెక్స్ట్ మీకే….. నెక్స్ట్ మీకే…. అంటూ వీపు రుద్ది వెళ్లేవాళ్ళే తప్ప ఒరిగిందేమీ లేదు. ఆయన చేత, చేతి ద్వారా ఎంతో మందికి పార్టీలో పదవులు గాని, టికెట్లు వచ్చే విధంగా అవకాశం కల్పించారు. గుంటూరు జిల్లాలో ఎంతోమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. అందరూ వెళ్లి ఒక్కసారైనా అధినేత దగ్గరికి వెళ్లి మర్రి విషయం ప్రస్తావించలేదు…. జగన్ కు తాను ఇచ్చిన మాట గుర్తు కూడా లేదు.

పార్టీలో లో మీరే పెద్ద మీరే దిక్కు అంటూ కనపడిన ప్రతి సారి అనడమే తప్ప ఆయన కోసం అండగా నిలబడిన వారు ఎవరూ లేరు. మాట తప్పిన పార్టీ అధ్యక్షుడు, సాయానికి రాని సన్నిహితులతో మర్రి రాజశేఖర్ అభిమానులు డీలాపడిపోయారు.

Related posts

చిత్తూరు నియోజకవర్గ తెదేపాకు దిక్కెవరు?

Satyam NEWS

సఖ్యత లేని నలుగురు మహిళా మంత్రులు

Satyam NEWS

శ్రీ సాయిబాబా ఆలయ నిర్వాహకులకు చిరంజీవి అభినందనలు

Satyam NEWS

Leave a Comment