చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఒరిగేది ఏమీ లేదని కడపజిల్లా రాయచోటి ఎమ్మెల్యే విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మీడియా తో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి అని అన్నారు. బాబు రాజకీయాల నుండి పూర్తిగా వైదొలిగితే రాష్ట్రం బాగుపడుతుందన్నారు.
ప్రభుత్వ తప్పిదాలు ఏమైనా ఉంటే ఎత్తి చూపాలే తప్ప నిరాధారమైన ఆరోపణలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని,తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కోరుకునేది రౌడీయిజం ఏదో ఒక రకమైన రాజకీయ దాడులు చేసే ఆలోచనతోనే ఉంటుందని విమర్శించారు.
చంద్రబాబు ఈ రోజు నువ్వు ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని ఏమని కలుస్తావు,గత ప్రభుత్వం లో నీ స్వార్థం కోసం తెలుగు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టింది నువ్వు కాదా,ప్రత్యేక హోదా విషయంలో మాట మార్చింది నువ్వు కాదా అని ప్రశ్నించారు.
ఎన్నికల ముందు రాజకీయ లబ్ధి కోసం మోడీని ఇష్టానుసారంగా తిట్టింది నువ్వు కాదా, అమిత్ షా పై రాళ్ళు వేయించింది నువ్వు కాదా అని ప్రశ్నించారు. ఇలాంటివి చేసి ఆరోజు చులకన అయ్యి,ఇదే రకమైనది మళ్లీ ఈరోజు చేస్తు,సిగ్గు లేకుండా ఈ రోజు మళ్లీ మోడీ వెనక ఎందుకు పడుతున్నావ్ అని ప్రశ్నించారు. రాజకీయంగా ఏదో ఒక సెన్సేషన్ చేసి పార్టీని బతికించుకోవడం కోసం అడ్డదారులు తొక్కుతున్న ది చంద్రబాబు నాయుడు అన్నారు.