బంగారు తెలంగాణలో దళితుడి అంతిమయాత్రకు దారి లేకపోవడం శోచనీయమని నిర్మల్ జిల్లా ముధోల్ మండలం లోని చింతకుంట గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
శనివారం గ్రామానికి చెందిన వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందగా వైకుంఠ ధామానికి దారిలేక గ్రామస్తులు అంతిమ యాత్రను నీళ్లలోని కొనసాగించి ఘటన చోటుచేసుకుంది.
అసువులు బాసి తెచ్చుకున్న తెలంగాణలో అంతిమయాత్రకు దారి లేకపోవడం బాధాకరమని గ్రామస్థులు వాపోతున్నారు.
ప్రజా ప్రతినిధులు స్పందించక పోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి ఇప్పటికైనా వైకుంఠ ధామానికి రహదారిని ఏర్పాటు చేయాలని కోరారు.