గతంలో చంద్రబాబు పాలనలో తెలుగుదేశం నాయకులు ఇసుకను దోచుకున్నారని, ప్రస్తుతం నూతన ప్రభుత్వం వచ్చిన తరువాత ఇసుకను పారదర్శకంగా పంపిణీ చేస్తున్నామని వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆయన నెల్లూరు జిల్లా, పొదలకూరు మండలం విరువూరు రీచ్ వద్ద జరుగుతున్న ఇసుక వారోత్సవాలలో పాల్గొన్నారు. నిర్మాణాలకు, వివిధ పనులకు సంబంధించి ఇసుక ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని వారం రోజుల పాటు ప్రభుత్వం వారోత్సవాలు నిర్వహిస్తుందని ఆయన తెలిపారు. చంద్రబాబు హయాంలో వర్షాలు అసలు లేవు, దానివల్ల ఇసుక ఉండేది. కానీ ప్రస్తుతం సకాలంలో వర్షాలు పడుతున్నాయి, అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నారు. కానీ చాలా చోట్ల నీరు అధికంగా ఉండడంతో ఇసుకకు కొంత ఇబ్బంది ఏర్పడింది అని ఆయన అన్నారు. శవాలను డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసి ఇసుక కొరత అంటూ తెలుగుదేశం నాయకులు దారుణంగా చేస్తున్నారని గోవర్ధన్ రెడ్డి అన్నారు. కుటుంబ కలహాలతో చనిపోయిన వారిని ఇసుక కొరతతో అంటూ తెలుగుదేశం నాయకులు నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.
previous post