తెలంగాణ విద్యార్థి ఉద్యమ రథసారథి, ఉస్మానియా యూనివర్సిటీ ముద్దుబిడ్డ, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవికి MLC ఇవ్వాలని మాదిగ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా ఇంచార్జ్ బోరెల్లి సురేష్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాన్ని, చదువును పన్నం గా పెట్టి, ఉమ్మడి పది జిల్లాల విద్యార్థులను ఏకం చేసి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని అన్నారు.
తనపై వందల కేసులు ఆంధ్ర పాలకులు పెట్టిన మడమ తిప్పకుండా తెలంగాణ ఉద్యమంలో కొన్ని వందల సార్లు జైలు జీవితం గడిపిన నిజమైన ఉద్యమ నాయకుడు పిడమర్తి రవి అని, అలాంటి నిజమైన నాయకుడికి వచ్చిన తెలంగాణలో సముచిత స్థానం కల్పించాలని ముఖ్యమంత్రి కేసిఆర్ కి మాదిగ జేఏసీ నుండి విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.