టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా కే. కేశవరావు, కేఆర్ సురేశ్రెడ్డి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఇరువురు తమ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. సురేశ్రెడ్డి, కేకే నామినేషన్ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఇంద్రకరణ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
అంతకు క్రితం గన్పార్క్లోని అమరవీరుల స్థూపం దగ్గర రాజ్యసభ అభ్యర్థులు కేకే, సురేష్రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్రెడ్డి, ఎంపీ సంతోష్కుమార్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.