భారతదేశ ఐక్యత, సమగ్రతకు తోడ్పడే విభాగంలో అత్యున్నత పౌర పురస్కారం అయిన ‘సర్దార్ పటేల్ నేషనల్ యూనిటీ అవార్డు’కు కేంద్ర హోంశాఖ ఆన్లైన్ నామినేషన్ లను స్వీకరిస్తుంది. నామినేషన్లను స్వీకరించడానికి చివరి తేదీ 15.08.2021గా నిర్ణయించారు.
కేంద్ర హోంశాఖ వెబ్సైట్ https://nationalunityawards.mha.gov.in లో ఆన్లైన్లో నామినేషన్ల ప్రక్రియ, అవార్డు విధివిధానాలు పొందుపరిచారు. భారత ప్రభుత్వం సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరిట అవార్డును ఏర్పాటు చేసింది.
జాతీయ సమైక్యత, సమగ్రతను ప్రోత్సహిస్తూ.. దేశ విలువను బలోపేతం చేయడానికి గుర్తించదగిన, ఉత్తేజకరమైన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు అందించడం జరుగుతోంది.