28.7 C
Hyderabad
April 20, 2024 07: 52 AM
Slider జాతీయం

జయప్రదకు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ

jaya-prada

అలనాటి సినీ నటి, రాజకీయ నాయకురాలు జయప్రదకు రామ్ పూర్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. గత సార్వత్రిక ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఆజం ఖాన్ రామ్ పూర్ పార్లమెంటరీ నియోజక వర్గం నుంచి దాదాపు లక్షకు పైగా ఓట్ల తేడాతో జయ ప్రద ని ఓడించారు.

లోక్ సభ ఎన్నికల సందర్భంగా జయ ప్రద నిర్వహించిన ప్రచారం నమూనా ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘటనలో కేసు నమోదైంది. విచారణకు హాజరు కాకపోవడంతో రామ్ పూర్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 20 కి వాయిదా వేసింది.

Related posts

మునుగోడులో గెలిచేది బీజేపీనే..

Satyam NEWS

భోగాపురం ఆర్అండ్ఆర్‌ కాల‌నీలో అన్ని స‌దుపాయాలు

Satyam NEWS

కమలనాధులకు కానరాని అధికార తీరం

Satyam NEWS

Leave a Comment